Editorial

Sunday, April 28, 2024
ప‌ద్యంచిగురు టాకులపైన సీతాకోక చిలుక : కవితశ్రీ పద్యం

చిగురు టాకులపైన సీతాకోక చిలుక : కవితశ్రీ పద్యం

“చెలుని గనిన వేళ …చెలియ కన్నుల వోలె …మెరుపు తోడ మిరిమిట్లు గొలుపు” అంటూ
కవిత్వంపైనే అల్లిన అపురూప పద్యమిది.

రక్తి గొలుపు ఈ రచన డా.డేరంగుల శ్రీనివాసులు గారిది.
అన్నట్టు, వారి కలం పేరు కవితశ్రీ. మరి, గానం శ్రీ కోట పురుషోత్తం.

ఇది తెలుపు టివి సమర్పిస్తున్న యాభయ్యవ పద్యం.
మిగితావన్నీ వినడానికి పద్య సంపదపై క్లిక్ చేయగలరు.

కోట పురుషోత్తం పరిచయం

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు టివి’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article