Editorial

Monday, May 20, 2024
శాసనంమొగుళ్ళూరు శాసనం - డా. దామరాజు సూర్య కుమార్

మొగుళ్ళూరు శాసనం – డా. దామరాజు సూర్య కుమార్

Epigraph

నేడు తారీఖు జూన్ 3

నేడు తేదీ జూన్ 3, తిథి వైశాఖ బహుళ నవమి/దశమి. శక సంవత్సరం 1497 యువనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి నాటి మొగుళ్ళూరు (నెల్లూరు జిల్లా) శాసనంలో శ్రీరంగరాయలు పెనుగొండనుండి పాలిస్తుండగా పత్తికొండ తిమ్మరాజయ్య మొగుళ్ళూరు గ్రామంలో చెంన్న కేశవ ప్రతిష్టచేసి దేవుని వళిగల్కు (దీపానికి) పందూము వరిచేను రెండు గొఱ్ఱుల చవనేలనిచ్చినట్టుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు III Ra 41].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

  • TAGS

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article