Editorial

Sunday, May 12, 2024
Audio Columnజాతి వైభవాన్ని తెలుపు పద్యం

జాతి వైభవాన్ని తెలుపు పద్యం

మన జాతి వైభవాన్ని ఎలిగెత్తి చాటుతూ, నాటి మహనీయుల పౌరుషాన్ని పేరు పేరునా మననం చేస్తూ ఒక మారు వారి స్పూర్తిని ఎదకు హత్తుకుని సాగవలసిన ఔచిత్యాన్ని తెలుగు తల్లికి ఆపాదిస్తూ, బిడ్డలకు ప్రేరణగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి.గారు రాసిన సీస పద్యం ఇది. గానం శ్రీ కోట పురుషోత్తం.

కోట పురుషోత్తం గారి పరిచయం

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article