Editorial

Monday, May 13, 2024
శాసనంబొల్లవరం, గురిజవోలు శాసనాలు

బొల్లవరం, గురిజవోలు శాసనాలు

Shasanamనేడు ఆగస్ట్ 23 వ తేదీ

క్రీ.శ 1543 ఆగస్ట్ 23 నాటి బొల్లవరం (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర పాప తిమ్మయదేవ మహారాజులు శ్రీ గోపీనాథపెరుమాళ్ళకు రేపటి నైవేద్య కైకర్యాలకి బొల్లవరం గ్రామ పేంట సుంకమును యిచ్చినట్లుగా చెప్పబడ్డది.[కడప జిల్లా శాసనాలు II నెం.275].

అట్లే క్రీ.శ 1546 ఆగస్ట్ 23 నాటి గురిజవోలు (గుంటూరు జిల్లా) శాసనంలో సదాశివరాయలు కొండవీటిసీమలోని గొరింజవోలు గ్రామాన్ని తిరువేంగళనాథుని సన్నిధిని తాళ్ళపాక తిరువెంగళనాథయ్యకు సర్వమాన్య అగ్రహారంగా యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా. XVI నెం.154].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article