Editorial

Friday, May 17, 2024
విశ్వ భాష‌కృష్ణ తేజం : సంత్‌ సూర్దాస్‌

కృష్ణ తేజం : సంత్‌ సూర్దాస్‌

శ్రవణ జ్ఞానేంద్రాయాన్నే నేత్రంగా భావించిన అంధ మహాకవి, ఆధ్యాత్మిక ప్రవక్త సంత్‌ సూర్దాస్‌ ఒక కృష్ణ తేజం. కృష్ణాష్టమి సందర్భంగా అపార భక్తి ప్రపత్తులతో మననం ఈ ప్రత్యేక వ్యాసం.

రమేశ్ చెప్పాల

దేవుళ్ళను పూజించాలంటే ఉన్నతకులంలో పుట్టి ఉండాలి. మడి కట్టుకోవాలి, మాంసాహారం తినకూడదు, అంటూ అనేక ఆంక్షలు ఉండేవి. సామాన్య ప్రజలకి, నిరక్షరాస్యులకు, వెనకబడ్డ కులాలకు దేవుని దూరంగా పెట్టిన రోజులవి…ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చేసి భగవంతుడు అందరివాడన్న సూక్ష్మాన్ని చాటిచెప్పడానికి ” భక్తి ఉద్యమం” మొదలైంది.

ఆట, పాట, స్మరణ, పూజ….మనసుకి తోచిన ఏ మార్గంలోనైనా భగవంతుని చేరుకోవచ్చునని భక్తి ఉద్యమంతో తేట తెల్లం చేసాడు. భక్తి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన సూర్దాస్ (సూర్‌దాస్‌).

సూర్దాస్ పుట్టుగుడ్డి కాదు.పుట్టుకతోనే గుడ్డివాడు అని కొన్ని చోట్ల వుంది కానీ నిజానికి పుట్టు గుడ్డివాడు కాదు సంత్‌ సుర్దాస్‌…. తన నడి వయసులో ఒక బలమైన కారణం చేత తనకళ్లు తనే తీసేకున్నాడని అంటారు!

ఆయన మంచి అందగాడు, ధనవంతుడు. అలాంటి సూర్దాస్ ఒకామె మోహంలో పడిపోయాడట. ఆమె కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాదంటారు. రాత్రి పగలు ఆమె ధ్యానంలోనే గడిపేవాడట… అలా కొన్నాళ్ళు గడిచాయి. సుర్దాస్‌ తండ్రి మరణించాడు. తండ్రికి శ్రాద్ధకర్మలను నిర్వహించే సమయంలో కూడా ఎప్పుడెప్పుడు ఆమెని కలుద్దామా!! అని అతని మనసు ఆరాటపడసాగిందట. ఆ ఆరాటంతోనే క్రతువుని ముక్తసరిగా ముగించి తన ప్రేయసిని కలుసుకునేందుకు బయల్దేరడం తన జీవితంలో పెద్ద మలుపు.

ఆ రాత్రి ఆమెతో జరిగిన సంభాషణతో సూర్దాస్ మనసు కకల వికలమై  ఏ అందానికి తను బానిస అయ్యాడో… ఆ ఆనందంపై తన మనసు మరలే అవకాశం లేకుండా కళ్లు తీసుకుని గుడ్డివాడైపోయాడంటారు. భగవంతుని మీదే దృష్టి ఎక్కుపెట్టాడనీ అంటారు.

సూర్దాసు (సూర్‌దాస్‌) ప్రేయసిని కలుసుకోవాలంటే ఒక నదిని దాటవలసి ఉంది. కానీ ఆ రాత్రి భీకరమైన వర్షం, హోరు గాలి. అలాంటి వాతావరణంలో, అంత చీకటివేళ నదిని దాటేందుకు పడవవాడు నిరాకరించాడట. దాంతో సూర్దాసు ఒక మొద్దు పట్టుకుని ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఇంతాచేసి అతను పట్టుకుని వచ్చినది మొద్దు(దుంగ) కాదు! అది శవం అని తెలుస్తుంది. మ్రాన్పడిపోతాడు. ఆ తర్వాత ఇంకో విస్మయకరమైన ఘటన. ప్రియురాలి మేడని ఎక్కేందుకు ఒక తాడుని పట్టుకుని పై అంతస్తుకి చేరుకుంటాడు. పైకి వెళ్లిన తర్వాత తాను పట్టుకున్నది తాడు కాదు, అది పెద్ద పామునని తెలియడంతో తేరుకోలేకపోతాడు. ఇవన్నీ సరే అనుకుంటే, అంత రాత్రివేళ, భారీ వర్షాలు, ఇలాంటి పరిస్థితులలో, ఎంతో ప్రమాదానికి ఓర్చి తన దగ్గరకు వచ్చిన సూర్దాసుని చూసిన ఆమె ఆశ్చర్యపోవడం మరో ఎత్తు. ఆమె దగ్గరికి రావడానికి తానెంత కష్టపడ్డాడో చెప్పి… ఆమెను దగ్గరికి తీసుకోబోయెంతలో మరి శరాఘాతం. అతనిలోని మోమపు తీవ్రతను చూసి ఆమెకు కంపరమెత్తిపోతుంది. ‘ఇదే ఆర్తిని ఆ భగవంతుని పట్ల చూపిస్తే నీకు ఆయన దర్శనం లభించి తీరుతుంది కదా’ అంటూ “నా మీద నీ వ్యామోహం తుచ్చమైనది” అని ఛీదరించుకుంటుంది.

ఆ రాత్రి ఆమెతో జరిగిన సంభాషణతో సూర్దాస్ మనసు కకల వికలమై పరివర్తన మొదలవుతుంది. ఏ అందానికి తను బానిస అయ్యాడో… ఆ ఆనందంపై తన మనసు మరలే అవకాశం లేకుండా కళ్లు తీసుకుని గుడ్డివాడైపోయాడంటారు. ఇక తాను భగవంతుని మీదే దృష్టి ఎక్కుపెట్టాడనీ అంటారు.

అలా సూర్దాస్ కన్నులు మూసి హృదయం తెరిచాడంటారు. దృష్టికీ, బంధాలకీ అతీతమైన ఆ పరమాత్మ మీద తన మనసుని లగ్నం చేసుకున్నాడనీ చెబుతారు. ఇదిలా ఉండగా అతడి జీవితంలో జరగవాలసిన ఘటన జరగడానికి సరైన వేళ రానే వచ్చింది.  ఒకరోజు తన ఊరిమీదుగా తీర్థయాత్రలకు వెళ్తున్న భక్తుల కీర్తనలు ఆయన చెవిన పడనే పడ్డాయి. ఆ కీర్తనలు విన్న సూర్దాస్ మనసుకి ఎంత సాంత్వన లభించిందీ అంటే, అంతే…ఇక ఇల్లు వదిలి యాత్రికులతో యమునాతీరానికి చేరాడు.

బృందావనంలో, కృష్ణుని మీద కీర్తనలు పాడుతూ సూర్దాస్ అలౌకకికమైన ఆనందాన్ని అనుభవించాడు. అది స్త్రీ సాంగత్యం కన్నా మించిందని గుర్తించాడు. అప్పుడు మొదలైంది జ్ఞానోదయం.. enlightenment.

ప్రయాణంలో ఓ రోజు ఆయన ఒక భక్త బృందాన్ని కలిసాడు. అక్కడే వల్లభాచార్యుల వారు కలిశారు. ఆయన సూర్దాసును తన శిష్యులలో ఒకరిగా చేర్చుకావడంతో తన భక్తికి గురువు కూడా తోడయింది.

సూర్దాస్ వల్లభాచార్యులుతో కలిసి బృందావనం చేరాడు. కృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ఆ బృందావనంలో, కృష్ణుని మీద కీర్తనలు పాడుతూ సూర్దాస్ అలౌకకికమైన ఆనందాన్ని అనుభవించాడు. అది స్త్రీ సాంగత్యం కన్నా మించిందని గుర్తించాడు. అప్పుడు మొదలైంది జ్ఞానోదయం.. enlightenment. ఇక ఆ రోజు నుండి భక్తి పారవశ్యంతో పరమాత్ముని మీద సూర్దాస్ పాడిన పాటలు, భజనలు అనతికాలంలోనే ఆయనకు గొప్ప గుర్తింపును తీసుకువచ్చాయి. ఎంతోమంది భక్తులకు చేరువ చేశాయి.

సూర్దాస్ భక్తిని గమనించిన వల్లభాచార్యులవారు సూర్దాస్ కు భక్తి ఉద్యమం గురించీ బోధించడం మరో మలుపు. దీంతో గురువు ప్రోత్సాహంతో సూర్దాస్ కవితా ప్రతిభ అసాధారణంగా వెళ్లి విరియడం విశేషం.

కృష్ణుని చూసిన కళ్లతో ఈ సమాజాన్ని చూడలేనంటూ సూర్దాస్ తిరిగి తనకు అంధత్వం ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకోవడం, ఇదంతా అతడి జీవితంలో చెప్పుకునే మరికొన్ని విశేషాల సమాహారం. అలౌకిక దివ్యజ్ఞానానికి, భక్తి పారవశ్యానికి ప్రతీకలు.

మీకు తెలుసు. అన్నమయ్య (తాళ్ళపాక అన్నమాచార్యులు) గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు.మే 9, 1408 ఫిబ్రవరి 23, 1503 మధ్య వారు జీవించారు. సూర్దాస్…1483-1584 మధ్య కాలంలో జీవించారు. తాను అక్బర్‌ సమకాలీన భక్తి ఉద్యమకారుడు సూర్‌దాస్‌.

గుడ్డివాడైన సూర్దాస్ ఒకరోజు లోతైన వ్యవసాయ బావిలో పడిపోయాడట. అనేక గాయాలతో ప్రాణాలతో మిగిలాదంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన కృష్ణుని ధ్యానించడం మానకపోవడం, సూర్దాసు భక్తికి మెచ్చిన కృష్ణపరమాత్ముడు స్వయంగా వచ్చి అతడిని రక్షించడం, ఆపై సూర్దాసుకి దృష్టి వచ్చే వరాన్ని ప్రసాదించడమూ, కానీ కృష్ణుని చూసిన కళ్లతో ఈ సమాజాన్ని చూడలేనంటూ సూర్దాస్ తిరిగి తనకు అంధత్వం ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకోవడం, ఇదంతా అతడి జీవితంలో చెప్పుకునే మరికొన్ని విశేషాల సమాహారం. అలౌకిక దివ్యజ్ఞానానికి, భక్తి పారవశ్యానికి ప్రతీకలు.

సూర్దాస్ తన జీవితకాలంలో లక్ష పాటలు రాశాడని చరిత్ర చెపుతోంది. అయితే వాటిలో ఎనిమిదివేల పాటలు మాత్రమే ప్రస్తుతం లైబ్రరీలో లభ్యమవుతున్నాయి. వీటిలో హిందీతో పాటుగా బ్రజ్ భాషలో పాటలు, పద్యాలు రాశారు.

బాలకృష్ణుడు పలికిన భాషలోనే బాలకృష్ణుని లీలలను గుర్తు చేసే సూర్దాస్ భజనలు అద్భుతాలు. ‘నేను వెన్న తినలేదమ్మా! ఎవరో నా మొఖానికి వెన్న పూశారు’ అంటూ ఆ వెన్నదొంగని గుర్తుచేసే ‘మై నహీ మాఖన్ ఖాయో!’ వంటి భజనలు సూర్దాస్ రచనలలో అనేకం కనిపిస్తాయి.

కృష్ణునితో అనుబంధం ఉన్న దేవభూమిలో అనాదిగా వినిపించే భాషే ఈ బ్రజ్ (braj) భాష! బాలకృష్ణుడు పలికిన భాషలోనే బాలకృష్ణుని లీలలను గుర్తు చేసే సూర్దాస్ భజనలు అద్భుతాలు. ‘నేను వెన్న తినలేదమ్మా! ఎవరో నా మొఖానికి వెన్న పూశారు’ అంటూ ఆ వెన్నదొంగని గుర్తుచేసే ‘మై నహీ మాఖన్ ఖాయో!’ వంటి భజనలు సూర్దాస్ రచనలలో అనేకం కనిపిస్తాయి. అలా కృష్ణభక్తిలో మునిగితేలుతూ, పదిమందికీ పంచుతూ వందేళ్లకు పైగా జీవించిన సూర్దాస్ మథుర సమీపంలో తన దేహాన్ని చాలించాడని  అంటారు. కానీ….అతని మరణం ఇప్పటికీ ఓ రహస్యమే….!!!

సెయింట్ అండ్ పోయిట్ సంత్ సూర్దాస్ కళ్లు లేకపోయినా దివ్య దృష్టితో ఎన్నో రచనలు చేశాడు. మహా సముద్రం యొక్క మహా సముద్రం (sur sagar), సుర్ సరావలి, సాహిత్య లహరి. వంటి అనేక రచనల్లో శ్రీ కృష్ణుడి మీద లక్షకుపైగా పద్యాలు,పాటలు, కీర్తనలు రాశాడు. అద్భుతమైన వర్ణనతో మనోవైజ్ఞానికమైన ‘రాధాకృష్ణుల’ లీలలు రాశారు. ఇప్పుడు మనం చూస్తున్న రాధాకృష్ణుల చిత్రాలన్నీ సంత్ సూర్దాస్ వర్ణనను బట్టి చిత్రీకరించినవే.

సంత్ సూర్దాస్ రచనలు చేసిన బ్రజ్ భాష… యూనివర్స్ లాంగ్వేజ్…ఒక  విశ్వ భాష (plebeian language).

సంత్ సూర్దాస్ రచనలు చేసిన బ్రజ్ భాష… యూనివర్స్ లాంగ్వేజ్…ఒక  విశ్వ భాష (plebeian language). సిక్కుల పరిశుద్ధ గ్రంథం గురు గ్రంథ్ సాహెబ్లో సంత్ సూర్దాస్ రచనలు ‘Hymns’ చోటుచేసుకున్నాయి.

సంత్ సూర్దాస్ పేరుమీద తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా గొల్లగూడలో ‘సూర్దాస్ భవన్ అంధుల పాఠశాల ఉంది. అక్కడ వందలాది మంది అంధ విద్యార్థులకు Education, sports, cultural activities, నేర్పిస్తూ వసతి కల్పిస్తున్నారు.

Sant Surdas (Sihi) metro station Delhi Faridabad, Haryanaలో ఉంది. ఇంకా దేశంలోని అనేక రాష్ట్రాలలో సూర్దాస్ మార్గ్ అని రోడ్స్ పేర్లు, బస్ స్టేషన్ పేర్లు ఉన్నాయి.

సూర్దాస్ మీద సినిమాలు కూడా తీసారు.Surdas (1939), Bhakta Surdas (1942), Sant Surdas (1975), Chintamani Surdas (1988) వంటి అనేక చిత్రాలు వచ్చాయి.

“దేవునికి రూపం ఉందని… పూజ, పునస్కారం, వ్రతం, మనుషుల్లో సంస్కారం తీసుకొస్తుంది” అన్నది సూర్దాస్ నమ్మిన ఫిలాసఫీ.

ఈమధ్య సబర్మతి ఆశ్రమంలో జరిగిన ‘ఆజాద్ కా అమృత్ మహోత్సవ్’ india@75 ఈ కార్యక్రమంలో భారతదేశ ఆధునిక జీవితం భక్తి, ముక్తి మీద ప్రజల్లో చైతన్యం కలిగించి, అఖిల భారత స్వభావాన్ని అలరించడంలో ప్రధాన పాత్ర పోషించిన కథానాయకుడు ‘సంత్ సూర్దాస్’ అని ఆయన్ని స్మరించి సూర్దాస్ జీవిత చరిత్ర ప్రజల చెంతకు చేరాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మోడీ అన్నారు.

ఆరోజుల్లోనే సూర్దాస్ అనే ఈ మహాభక్తుడు కృష్ణుని కీర్తిస్తూ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం తిరిగి భక్తి ఉద్యమం ద్వారా పరమాత్ముని కీర్తించాడు. దాంతో ఉవ్వెత్తున ఎగిసి హిందూ మతానికి పునర్వైభవం రావడానికి సూర్దాస్ కీర్తనలు ప్రముఖ పాత్రని పోషించాయి. “దేవునికి రూపం ఉందని… పూజ, పునస్కారం, వ్రతం, మనుషుల్లో సంస్కారం తీసుకొస్తుంది” అన్నది సూర్దాస్ నమ్మిన ఫిలాసఫీ.

శ్రవణ జ్ఞానేంద్రాయాన్నే నేత్రంగా బావించిన అంధ మహాకవి, ఆధ్యాత్మిక ప్రవక్త,సంత్‌ సుర్దాస్‌  ఒక కృష్ణ తేజం. కృష్ణాష్టమి రోజు వారిని స్మరించుకొని తెలుపడం ఒక గొప్ప భావన. మెలకువ. స్ఫూర్తి.

వ్యాసకర్త రమేశ్ చెప్పాల రచయిత, సినీ దర్శకులు. ఇటీవల వారు ‘మా కనపర్తి ముషాయిరా’ అన్న కథల సంపుటి, ‘బాంబే డాల్’ అన్న నవలను వెలువరించారు. రచనల్లో ఆధ్యాత్మిక ధార అంతస్రవంతిగా ఉండటం వారి ప్రత్యేకత. ఇ మెయిల్ : rameshcheppala@Gmail.com

More articles

4 COMMENTS

  1. Sir meeru thop…
    Mee stories anni xllent untayi, meeru rasina prathi book chadvuthunnanu, anni kothaga and interesting ga untay sir mee books anni.

    Ila mee books I ka enno ravali sir..

  2. ధన్యవాదాలు రమేశ్ గారు, సూర్దాస్ గురించి మగురివ్యాసాన్ని అందించారు , ఇప్పటివరకు వారి కీర్తనలు విన్నాము కాని వారిగురించి సవివరంగా తెలుసూన్నాము, ఇప్పుడు కూడా కులాలకతీతంగా భక్తి ఉద్యమంలా మరో ఉద్యమం హిందూ జాగ్రుతం కొరకు అవసరం అనిపిస్తుంది. మీకు మొరోసారి ధన్యవాదాలు 🙏

  3. మనకి తెలియని అద్భుతాలు ఈ లోకం లో చాలా ఉన్నాయి .అందులో సూర్దాస్ జీవితం ఒక్కటి…ఈ పర్వ దినాన కృష్ణుని గురించి..ఆయన భక్తుని గురించి అద్భుతంగా ప్రసెంట్ చేసిన రమేష్ చెప్పాల గారికి కృతజ్ఞతలు….
    సార్ నేను మీ” మా కనపర్తి ముషాయిరా”, బాంబే డాల్ నవల …చదివాను చాలా బాగున్నాయి..
    మీ నుండి నెక్స్ట్ ఎం వస్తుందా…అని వెయిటింగ్ సార్…

  4. సూర్దస్ గురించి చాల గొప్పగా చెప్పారు సార్ మలినమైన ఆలోచనలోంచి మంచి వైపుకు ఎలా మరలలో ఏది నిజమైన ఆనందం ఏది జీవిత పరమార్థం అన్ని మీరు చాలా చక్కగా వివరించారు.. మీ వర్ణన అద్బుతం.. సామాన్యుడి కి కూడా అర్థమయ్యేల సరళమైన భాషలో వ్యక్తీకరణ చేయడం మీ ప్రత్యేకత.. మీ కనపర్తి..ముషాయిరా బాంబే డాల్ నవలలు అత్యద్భుతంగా ఉన్నాయి..మీ పెన్ను కు వెన్ను వంచి నమస్కరిస్తున్నాను..ఇంత గొప్ప ఆధ్యాత్మిక వ్యాసం అందించి మమ్మ్మల్ని ఆనందింప చేసినందుకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article