Editorial

Saturday, May 11, 2024
Audio Columnపండుటాకుల వేదన తెలుపు పద్యం

పండుటాకుల వేదన తెలుపు పద్యం

  రక్త మాంసాలు ధారపోసినా గానీ వృద్దాశ్రమాల్లో మగ్గవలసి వస్తోన్న పెద్దలపై, వారిని అనివార్యంగా అక్కున చేర్చుకున్న వృద్దాశ్రమాలపై ఆవేదనతో రాసిన సీస పద్యం ఇది. పిల్లల బాధ్యతను గుర్తు చేసే ఈ రచన తల్లిదండ్రుల దీనస్థితికి దర్పణమే కాదు, వారు తమ ఇంటిని కాదని, ఆశ్రమాలను ఆలయంగా చేసుకున్న నిస్సహాయస్థితికి  నిదర్శనం. రచన ఆముదాల మురళి. గానం శ్రీ కోట పురుషోత్తం.

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article