Editorial

Sunday, April 28, 2024
ప‌ద్యంఆహుతులకు స్వాగతం పలికే పద్యం - శ్రీ ఆముదాల మురళి

ఆహుతులకు స్వాగతం పలికే పద్యం – శ్రీ ఆముదాల మురళి

సభకు స్వాగతం పలికే పద్యం

వివిధ రంగాల్లోని ప్రముఖులను, విజ్ఞులను, సంగీత సాహిత్య స్రష్టలను , రస పిపాసులను, శ్రోతలను పేరుపేరునా ప్రస్తావిస్తూ సభాముఖంగా అతిథులను సాదరంగా ఆహ్వానించడానికి గాను శ్రీ ఆముదాల మురళి విరచిత అభివాద పద్యమిది. గానం శ్రీ కోట పురుషోత్తం.

కోట పురుషోత్తం పరిచయం

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు టివి’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article