Editorial

Saturday, May 18, 2024
శాసనంకొఱ్ఱపాడు, పోలవరం శాసనాలు

కొఱ్ఱపాడు, పోలవరం శాసనాలు

Shasanamనేడు జులై 28 వ తారీఖు

క్రీ.శ 1527 జులై 28 నాటి కొఱ్ఱపాడు (కడప జిల్లా) శాసనంలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం చేస్తుండగా దొమ్మర యిరవైనాలుగు కులాల వారి పంపున మీసరగండని మాధవరాజు, కాకికేశ్వరాజులు కొఱ్ఱపాటి చెన్నకేశవ దేవరకు గ్రామాన వారికి వచ్చెడి త్యాగం ఏటా ఒక వరహా గద్యాణమును సర్వమాన్యంగా యిచ్చినట్లు చెప్పబడ్డది. [ద.భా.దే.శా. XVI నెం 81].

అట్లే క్రీ.శ 1529 జులై 28 నాటి పోలవరం (ప్రకాశం జిల్లా) శాసనంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో రాయసం తిమ్మరుసయ్య భ్రిత్యులు వేమరుసయ్య కుమారుడు అయ్యపరసుగారు పోలవరం గ్రామాన్ని శ్రీ తిరువెంకటాద్రినాథుని అమృతపళ్ళకు ధారవోసి యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు I Darsi 53].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article