Editorial

Monday, May 20, 2024
శాసనంబొల్లాపల్లి, జిల్లెల్ల శాసనాలు

బొల్లాపల్లి, జిల్లెల్ల శాసనాలు

Epigraphనేడు జూలై 5 వ తారీఖు

క్రీ.శ 1545 జూలై 5 నాటి బొల్లాపల్లి (ప్రకాశం జిల్లా) శాసనంలో సదాశివరాయలు శ్రీమదుభయ వేదాంత ప్రతిష్ఠాపనాచార్యులైన తాళపాక తిరుమలయ్యంగారి కుమారుడు కోటి తిరువేంగళనాథయ్యంగారికి కొండవీటి రాజ్యంలోని అద్దంకి సీమలోని బొల్లాపల్లి గ్రామాన్ని అగ్రహారంగా చేసి ఉదక ధారాపూర్వకంగా యిచ్చినట్లుగా చెప్పబడ్డది.[నెల్లూరు జిల్లా శాసనాలు II Omg 15].

అట్లే క్రీ.శ 1549 జూలై 5 నాటి జిల్లెల్ల (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల కాలంలో మహామండలేశ్వర చిన్న తిమ్మరాజు కొండయ్య దేవమహారాజులుంగారు శ్రీ అహోబల నరసింహదేవునికి చెల్లే జిల్లెల్ల గ్రామంలో వచ్చే కానిక, కట్నాల వల్లవచ్చే రొక్కమును శ్రీ వీరభద్రదేవుని పరపు (?),పారువేట మహోత్సవాలకు త్రివాచకంగా ధారవోసి యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా. XVI నెం 173].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article