Editorial

Wednesday, April 30, 2025
శాసనంఆకుమంత్రాయము మినహాయింపు

ఆకుమంత్రాయము మినహాయింపు

Epigraph
ఈ రోజు జూన్ 18 వ తారీఖు
క్రీ.శ 1552 జూన్ 18 సదాశివరాయల నాటి మార్కాపురం (ప్రకాశంజిల్లా) శాసనంలో మారకాపురం (మార్కాపురం) చెన్నప్ప (చెన్నకేశవ దేవర)కు ఆకుతోటలు చేసేవారికి ఆకుమంత్రాయము (పన్ను) మినహాయింపు నిచ్చినట్టుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర వివరాలు తెలియరావడం లేదు. కార్యకర్తలైన కసవకంటి పద్మనాభయ్య,ముద్రాకర్తలైన మలప్పంగారు,స్థానాపతియైన..అప్పయంగారు,చంనయ అప్పనంగారు మున్నగు పేర్లు ప్రస్తావించబడ్డాయి. [ద.భా.దే.శా.XVI నెం 183].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article