Editorial

Saturday, May 18, 2024
శాసనంఆలగడప శాసనం

ఆలగడప శాసనం

Shasanamనేడు జూలై 22 వ తేదీ

క్రీ.శ.1319 జూలై 22 నాటి ఆలుగడప (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని సర్వాధికారి హెంమాడి దేవనాయనింగారు ఆలుగడప అష్టాదశ ప్రజలున్ను రాచచేలు వెలిపొలము, నీరునేలల పహిండి సుంకము మున్నగు అన్నిసుంకాలలో మాడకు మాడబడిని పాతిక లెక్కన ఆ ఊరి తూర్పునగల త్రిపురాంతక దేవర రంగ భోగానికిచ్చినట్టు, అట్లే పరశురామదేవమహారాజులు 5 మాడలిచ్చినట్లుగాను చెప్పబడ్డది.

శాసన శిల మరొక వైపుగల మరొక శాసనంలో శ్రీమత్ప్రౌఢ ప్రతాపచక్రవర్తి పరశురామ దేవమహారాజులు (? )ప్రోలేశ్వర దేవరకు భూములను సర్వమాన్యముగా యిచ్చినట్లు చెప్పబడ్డది. [నల్లగొండ జిల్లా శాసనాలు I నెం 101].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article