Editorial

Saturday, May 18, 2024
Uncategorizedనేటి రోజున ఐదు శాసనాల లభ్యం

నేటి రోజున ఐదు శాసనాల లభ్యం

Shasanam

నేడు ఆగస్ట్ 14 వ తారీఖు

నేటి రోజున ఇదు శాసనాల లభ్యం : వేల్పూరులో రెండు- కొణిదెన, గోరంట్ల, నాదెండ్లలో ఒక్కో శాసనం

 

క్రీ.శ 1221 ఆగస్ట్ 14 నాటి కొణిదెన (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుడు రాజ్యం చేస్తుండగా కమ్మనాటి రాజధాని కొట్యదొన శంకరేశ్వర శ్రీమహదేవరకు బల్లసాని అరదీపం పెట్టినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.VI నెం. 618].

క్రీ.శ 1239 ఆగస్ట్ 14 నాటి వేల్పూరు (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో వారి పాద పద్మోపజీవి సోమరౌతు రాణి ఐతసాని వేల్పూరు శ్రీ రామేశ్వరదేవరదేవ మహాదేవుని అఖండ దీపానికి 25 మోదాలు పెట్టినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా X నెం 290].

క్రీ.శ 1264 ఆగస్ట్ 14 నాటిదే వేల్పూరులోనిదే మరో శాసనంలో కాకతీయ రుద్రమ పాలనలో కోట పాలకులు నాలుగు వాడ్ల (వాడల) పూజారులకు భూములు, యిండ్లు యిచ్చినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర వివరాలు తెలియరావడంలేదు. [ద.భా.దే.శా X నెం 401].

క్రీ.శ 1524 ఆగస్ట్ 14 నాటి గోరంట్ల (అనంతపురం జిల్లా) శాసనంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో వాకిటి ఆదెప్పనాయనింగారి కార్యకర్తలైన సూరపరాజుగారు సోమేశ్వరుని గుడి శిఖరము ఛిద్రమైన చోట బాగుచేసినట్లు తంబళ్ళవారిచే విస్తరాకుల వెట్టిని మాన్పించినట్లు చెప్పబడ్డది. [ద.భా.దే.శా. XVI నెం.89].

క్రీ.శ 1579 ఆగస్ట్ 14 నాటి నాదెండ్ల శాసనంలో శ్రీరంగరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర గొబ్బూరు తింమ్మరాజయ్యగారి కార్యకర్తలైన రామాపండితులుంగారు నాదెండ్ల గోవర్థనరాయ అంగరంగ వైభవాలకు నిత్య నైవేద్యాలకు దీపారాధనకు వెలిపొలము తదితర భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 686].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article