Editorial

Monday, May 20, 2024
సంపాద‌కీయంCross roadsలో One Man Army : తొవ్వ దొరకని 'ఆద్యకళ'

Cross roadsలో One Man Army : తొవ్వ దొరకని ‘ఆద్యకళ’

హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శితమవుతున్న ఆద్యకళ భవితవ్యం గురించి ఆలోచిస్తే ఆ ప్రదర్శనకు మూలమైన శ్రీ జయధీర్ తిరుమల రావు గారు నాలుగు దశాబ్దాలకుపైగా పరిశోధనలో సేకరించిన నాలుగు విభాగాల సంపద నేడు క్రాస్ రోడ్స్ పైన ఉన్నదా అన్న సందేహం కలుగుతోంది.

వారు చింతించకుండా ఒక విశ్వ విద్యాలయానికి త్రోవ తీయడం అవశ్యం అని ఆకాంక్షిస్తూ ఆ మేరకు రాస్తున్న ఈ తెలుపు సంపాదకీయం పౌర సమాజానికి ఒక అర్తివంతమైన పిలుపు అని విజ్ఞప్తి.

కందుకూరి రమేష్ బాబు 

తెలుగు విశ్వ విద్యాలయం, సాంస్కృతిక శాఖ, చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ సమర్పిస్తున్న ఈ ఆదివాసీ, జానపద కళా సంపద భవితవ్యం మరో నాలుగు రోజులు గడిస్తే ఏమిటీ అన్నది ప్రశ్న?

శ్రీ జయధీర్ తిరుమల రావు గారు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఉద్దేశ్యంలో బహుశా ఒక ముఖ్య ఉద్దేశ్యం ఇంతకాలం సేకరించిన నాలుగు విభాగాల సంపదను ఒక్క చోట చూపి ప్రభుత్వానికి ఒక ఆలోచన కలిగించాలని. అలాగే ప్రజలు సందర్శించడం ద్వారా వారిని కొంత ఎడ్యుకేట్ చేయాలని, దీనికి తోడు వివిధ రంగాల్లోని ప్రముఖులు, వ్యక్తులకు ఈ విలువైన సేకరణ గురించి తెలియజేయడం వలన ఈ సంపద భవిత గురించి తామూ కొంత బాధ్యతగా ఆలోచిస్తారని. బహుశా ఇవే తిరుమల రావుగారి ఆలోచనలో ఉండి ఉంటాయి. ఐతే, తన సేకరణ ఒక నాడు ఈ స్థాయికి వస్తుందని, దాన్ని భావి తరాలకు భద్రంగా అందించే గురుతర బాధ్యత తనపై ఉంటుందని వారు మొదట అడుగు వేసినప్పుడు ఊహించి ఉండరు. అలాంటి తరుణం వచ్చాక కూడా మానసికంగా శారీరకంగా తగిన వ్యూహాన్ని అనుసరించి వెళ్లి ఉండరు. బహుశా అందువల్లే అయనకు ఈ వయసులో దాన్ని ఏమి చేయాలీ అన్న శంక పట్టుకుని వేధిస్తూ ఉండవచ్చు. ఆ క్రమంలో అయన అన్ని శక్తులూ పెట్టి ఈ ఘడియలో ఒక సానుకూల స్పందనకోసం ప్రభుత్వం వైపు, పౌర సమాజం వైపు చూస్తూ ఉండవచ్చు. బహుశా ఈ ప్రదర్శన అందుకే అయి ఉంటుంది కూడా. కానీ, ఇప్పుడు మనం దృష్టి సారించవలసిన తరుణం వచ్చింది. మన బాధ్యతే కీలకం కాబోతున్నది.

నిజానికి తన ఉద్దేశ్యాలలో ఒకటి కొంత వరకు నెరవేరినట్లే ఉన్నది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వచ్చి చూడటమైతే జరిగింది. కానీ వారి ద్వారా ఈ సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి పోయిందా అన్నది అనుమానమే. తన ప్రయత్నానికి శాశ్వత వేదిక కల్పించగలిగే అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే అనుకుంటే అది వారికి చేరిందా అన్నది సందేహమే.

అధ్యకళ ఒక బృహత్తర ప్రయత్నం. అది నాలుగు అంశాల సమ్మేళనం. ఆది ధ్వని, ఆది చిత్రం, ఆది అక్షరం, ఆది లోహం – ఈ నాలుగు విభాగాలకు సంభంధించిన వేలాది కళా రూపాలు, శిలాకృతులు, సంగీత వాయిద్యాలు, తాళ పత్ర గ్రంధాలు, పటాలు, దస్తావేజులు, తోలు ఎముకలు, లోహ వస్త్రాకృతులు, ఒక్కటని కాదు, వేలాదిగా, ఇంతకాలం ఎంతో వ్యయ ప్రయాసలకు లోబడి, అంతకన్నా ముఖ్యం వారు ఎంతో సమయం, డబ్బు, శక్తి వెచ్చించి సేకరించిన చేసిన కృషికి ఇది పతాక నిదర్శనం. ఐతే, తిరుమల రావు గారి ఈ బృహత్తర కృషి, సేకరణలోని సమస్త వస్తువులూ వచ్చేవారం నుంచి ఎక్కడ ఉంచాలీ అన్నది ప్రశ్న!

తానైతే వీటి బాధ్యత ఇక ముందు తనది కాకుండా చూసుకోవాలని ఉందని చెప్పారు. ఎవరైనా ముందుకు వస్తే మొదటి దశలో తాను ఉండి మ్యూజియం ఏర్పాటుకు నిలబడుతాను అన్నారు. ఐతే, తనకు చేయవలసిన పనులూ ఎన్నో ఉన్నాయి. కానీ చేసిన పనిని ఒక దారిన, సరైనా త్రోవలో పెట్టడం మటుకు ఆయనకు శక్తికి మించిన పని అని వారు భావిస్తున్నారు. అందువల్లే ఏంతో ఆర్తితో, ఒకింత బాధతో అన్నిటినీ ఒకే చోట ఇలా ప్రదర్శన పెట్టినట్టు ఉంది. ఒక రకంగా ఇది ఆర్తి అనాలా లేక అనివార్యత అనాలా లేక నిస్సహాయత అనాలా లేక ఈ కరోనా మహామ్మారి సమయంలో ఆరోగ్యం సహకరించిన సమయంలోనే చేయాలన్న ఆలోచనలో భాగమా అన్నది చెప్పడం కష్టం. అన్ని కలగలసి ఉన్నాయనే అనిపిస్తుంది.

నిజానికి దశాబ్దాల తన ముక్కుసూటి  వైఖరి కారణంగా ప్రభుత్వాలకు వారు ఆప్తుడు కాక పోవడం, నిజానికి ప్రజా మేధావిగా తానొక ఒంటరి సేన కావడం అయన బలహీనత. విచారకరమైనది ఏమిటంటే, నిన్నటిదాకా అదే తన బలం.

తిరుమల రావుగారికి వయసు మీద పడటం, మునుపటి శక్తి లేకపోవడం, స్వయంగా మ్యూజియం స్థాపించడానికి ఆర్థిక దన్ను లేకపోవడం, తనకున్న ఆత్మీయులు, సన్నిహితులకు దీన్ని ఒక స్థాయికి చేర్చే శక్తి లేకపోవడం, శక్తి ఉన్నా కొందరికి సంసిద్దత లేకపోవడం, ఇటువంటి అనేక కారణాల రీత్యా ఆయన మనసు నొచ్చుకున్నా గంభీరంగా చేయవలసిన పని చేస్తున్నారు. నిజానికి దశాబ్దాల తన ముక్కుసూటి  వైఖరి కారణంగా ప్రభుత్వాలకు వారు ఆప్తుడు కాక పోవడం, నిజానికి ప్రజా మేధావిగా తానొక ఒంటరి సేన కావడం అయన బలహీనత. విచారకరమైనది ఏమిటంటే, నిన్నటిదాకా అదే తన బలం. నేడు దాన్ని సంస్థగా మలుచుకోవడం బలహీనతగా కానవస్తన్నది. ఇదొక భౌతిక వాస్తవికత కాబోలు.

కాకపోతే, మరి కొన్ని దశాబ్దాలు గడిస్తే, వీటి పట్ల సరైన నిర్వహణ లేకపోతే సేకరించిన వస్తువులు దెబ్బ తినడం ప్రారంభమవుతుంది. ఆ భయం కూడా తనకు ఉన్నది. మరో వంక ప్రభుత్వాలకు దీర్ఘకాలికంగా ప్రజల సంస్కృతి పట్ల అంత ఆసక్తి లేదు. ప్రజలు కేంద్రంగా జరిగే కార్యాచరణ ప్రభుత్వాలకు సహజంగానే ఇబ్బంది. అది కూడా పెద్ద సామస్యగా ఉన్నది. ఐనప్పటికీ తిరుమలరావు గారు అన్ని తెలిసి ఒక ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వ పెద్దల వైపు చూపు సారిస్తూనే పౌర సమాజం వైపు కూడా దృష్టి నిలిపారు. కానీ, రేపేమి జరుగుతుంది అన్నది సందేహమే.

ఇటువంటి పలు ప్రశ్నలు రేపే అలజడి వారిని స్థిమితంగా ఉండనీయడం లేదని కూడా సన్నిహితంగా గమనిస్తే పోల్చుకోవచ్చును.

ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక మ్యూజియం ఏర్పాటుకు నడుం కడుతుందా లేక తిరుమల రావు గారు దీన్నంతా ప్రైవేట్ కలెక్షన్స్ కి ఇచ్చేయక తప్పదా? కాదంటే విడి విడిగా ఆయా వ్యక్తుల సేకరణకు ఆందజేయడమా? అదీ కాదంటే ఇదివరకులా తలా కొందరి ఇళ్ళలో కొన్నేసి ఉంచి ఒక మూలకు పెట్టేయడమా అన్నది పెద్ద ప్రశ్న. ఇటువంటి పలు ప్రశ్నలు రేపే అలజడి వారిని స్థిమితంగా ఉండనీయడం లేదని కూడా సన్నిహితంగా గమనిస్తే పోల్చుకోవచ్చును.

ప్రభుత్వంలోని వివిధ శాఖల బాధ్యులు, సంచాలకులు వచ్చి చూస్తున్నారు, గవర్నర్ మొదలు, వైస్ చాన్సలర్లు, ప్రభుత్వ సలహాదారులు, మంత్రులూ వస్తున్నారు. తిరుమల రావు గారు ఒక్క చోట చేర్చిన ఈ సంపదను చూసి విస్మయానికి లోనవుతున్నారు. చేతనైనది చేస్తామని ప్రామిస్ చేసి వెళుతున్నారు. ఇక కవులు, రచయితలు, మేధావులు సరే సరి. వారూ సామాన్యజనంలా వచ్చి చూసి వాటి వివరాలను తెలుసుకుని ముచ్చట పడుతున్నారు. అబ్బుర పడుతున్నారు. ఇంత విలువైన సేకరణ గురించి ప్రభుత్వం ఏదైనా చేస్తే బాగుంటుందని అభిలషిస్తున్నారు. తిరుమల రావు గారి కృషికి మనసారా అభినందనలు తెలుపుతున్నారు. కొందరు తన ప్రయత్నం ఒక రూపం దాల్చకపోతే బాగుంటుందని కూడా కోరుకుంటున్నారు. అన్ని ఉన్నాయి. వీటి మధ్య పత్రికా విలేకరులు, వివిధ టివి చానల్లు చక్కటి కథనాలు ప్రసారం చేస్తున్నాయి. సెల్ఫీలు దిగే వారు దిగుతున్నారు. ఇవన్నీ సరే, కానీ ఇప్పుడు జరగవలసినది ఏమిటి? వీటి సంరక్షణ కదా అసలు ప్రశ్న. మరి,  ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఎవరు చెప్పాలి? దానికి ఎలా, ఎక్కడి నుంచి బీజం పడాలీ అన్నది ప్రశ్న.

ఒక తండ్రిలా సంరక్షించవలసిన పాత్ర తిరుమల రావుగారిది. ఎవరికైనా ఇస్తే అది అనాధగా మారుతుంది. తనొక మరు తల్లిగా మారుతారు. అది మరింత బాధాకరం. ఈ విపత్కర సన్నివేశంలో అద్యకళ అన్నది మరొక త్రివ చూసుకోవలసి ఉన్నది.

ఇదంతా అపురూప సంపద. కానీ దాని ‘సంరక్షణ’ ఇప్పుడు అతి పెద్ద ఆవశ్యకత.

ఒక తండ్రిలా సంరక్షించవలసిన పాత్ర తిరుమల రావుగారిది. ఎవరికైనా ఇస్తే అది అనాధగా మారుతుంది. తనొక మరు తల్లిగా మారుతారు. అది మరింత బాధాకరం. ఈ విపత్కర సన్నివేశంలో అద్యకళ అన్నది మరొక త్రివ చూసుకోవలసి ఉన్నది.

కాగ, దీని నిర్వహణ కోసం తిరుమల రావు గారి సహకారంతో ప్రభుత్వం ఒక మ్యూజియంను నెలకొల్పడం, అందుకోసం స్థలం, వనరులు ఏర్పాటు చేయడం జరూరుగా ప్రభుత్వం విధి అని ఎవరైనా సహజంగా డిమాండ్ చేయవలసిందే. కానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉన్నదీ అంటే విస్తారమైన ప్రాజెక్టులు ఏవైనా నేరవేరాలీ అది కమిషన్ లపై ఆధార పడి జరగవలసినదే. రాష్ట్రంలో బహుజన ఆదివాసీ కళల గురించి పని చేసే వారు కూడా ప్రభుత్వం ముందు గానీ సంపన్నుల ముందు గానీ చేయి చాపడం వల్ల లాభం లేదు. చేతులు తడిపే పని మాత్రమే చేయవలసి ఉన్నది. అది ఆర్గానిక్ మేధావిగా – తాను పుట్టుక ఎదుగుదల ఎదురీత కారణంగా, అగ్ర కుల సంపన్న వర్గం నుంచి రాని కారణంగానూ తిరుమల రావు గారికి ఈ అధ్యకళ మ్యూజియం ఏర్పాటు ఒక కలగానే మిగిల నున్నాదా అన్న చింత కలుగుతోంది. వారికి ప్రభుత్వాన్ని ఒప్పించే సామజిక దన్నులేదు. తనంతఃత తాను ప్రభుత్వేం ఇది చేయాలనీ డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఇందుకోసం పోరాటాలు నడిపే వెసులుబాటూ లేదు. లాబీయింగ్ తప్పా మరొక మార్గం లేదు. చివరకు ప్రభుత్వం కాస్త చేస్తాను అంటే తన ఆత్మగౌరవం వీడి, ప్రభుత్వం పెద్దల ముందు తలొగ్గడం తప్పా వేరే దారి లేదు.

నిజానికి చరిత్ర, మానవ పరిణామాన్ని చెప్పే ఈ సకల కళాకృతులు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తగ్గ రీతిలో ఉన్నాయి. అసలైన నాంది అలా ఆ దిశలో పడవలసి ఉన్నది.

నిజానికి చరిత్ర, మానవ పరిణామాన్ని చెప్పే ఈ సకల కళాకృతులు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తగ్గ రీతిలో ఉన్నాయి. అసలైన నాంది అలా ఆ దిశలో పడవలసి ఉన్నది. అందుకు మరో తరం దాకా పోరాడవలసిన శక్తి ఇప్పుడు తిరుమల రావు గారి వద్ద లేదు అని అనుకుంటే ఈ దిశలో ఒక్క ఆలోచనా సాగదు. కానీ చేయవలసిన ఆలోచనలు మ్యూజియం వైపు కాకుండా ఒక స్వతంత్ర విశ్వ విద్యాలయం వైపుకే అని చెప్పక తప్పదు.

నిజానికి ఆయా కళాకృతులు కూడా ఒక్క రకం కాదు. అవన్నీ ఎన్నో విభాగాలుగా విభజించవలసి వస్తుంది. ప్రభుత్వంలోని విడివిడి ముఖ్య విభాగాల అధిపతులకు కూడా ఇంత విస్తారమైన సంపదను ఎలా తమ పరిమితుల్లో సంరక్షించాలీ అన్నది తెలియడం లేదు. అందువల్ల కూడా ఏ ఒక్క విభాగమూ వీటిని వోన్ చేసుకునే పరిస్థితి లేదు. ఆదివాసీ గురిజన శాఖ వీటిని వొన్ చేసుకోలేదు. సాంస్కృతిక శాఖ తన వల్లా ఇంతటి విస్త్రుత సేకరణా భారాన్ని మోయలేను అనవచ్చు. విద్యా విషయకంగా అనేక అంశాలు ఇముడ్చుకున్న సంపద కనుక ఆ శాఖ సైతం ఈ బాధ్యత తమకూ కొత్తే అంటుంది. అంతేకాదు, ఇది జానపద, ఆదివాసీ చరిత్ర, పరిణామ క్రమాన్నే గాక సంగీత నాటక అంశాల మేలుకలయిక కాబట్టి అకాడమీలు చొరవ చూపాల్సి ఉంది. కానీ అవి తమకు సరైన బడ్జెట్ లు లేవని చేతులు ఎత్తేస్తాయి. మీదు మిక్కిలి, ఇదంతా ఆంత్రోపాలజీని చెప్పే సంపద కనుక ఆ రకంగానూ దీని విస్తృతి ఉన్నందున ఈ సేకరణ అంతా ఒక్క శాఖ పరిధిలో ఇమిడేది కాదని ప్రభుత్వం కాలయాపన చేయవచ్చు. కనుక అధ్యకళ చూడ వచ్చిన ప్రభుత్వం రంగ ప్రముఖులు ఎవరూ కూడా పెద్దగా చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చు. అదీ తిరుమల రావుగారికి మరింత ఆందోళన కలిగిస్తూ ఉండవచ్చు. దాంతో ఇక వారికి ఇక మిగిలింది ఒకే మార్గం. అది ముఖ్యమంత్రిని సంప్రదించడం.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పా ఈ అంశంలో పెద్ద ఎత్తున చొరవ చూపి, ఏదైనా అద్భుతం చేయగలిగే శక్తి మరొకరికి లేదని ఎవరైనా అనుకోగలరు. దురదృష్టవశాత్తూ నేడు వారి దృష్టంతా ఎన్నికలకు సన్నద్ధం కావడంపైనే ఉంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పా ఈ అంశంలో పెద్ద ఎత్తున చొరవ చూపి, ఏదైనా అద్భుతం చేయగలిగే శక్తి మరొకరికి లేదని ఎవరైనా అనుకోగలరు. దురదృష్టవశాత్తూ నేడు వారి దృష్టంతా ఎన్నికలకు సన్నద్ధం కావడంపైనే ఉండటం, తక్షణం వివిధ వర్గాలకు ఆర్థికంగా లభాకరంగా ఉండే పథకాలతో సన్నిహితం కావాలనే యోచనలో ఉండటం, దీర్ఘకాలికంగా ప్రజల సంస్కృతి సంపద గురించి యోచించే తీరిక లేకపోవడం, ఇవన్నీ ఒక అవరోదంగా భావించవచ్చు.

నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బాధ్యత భరించడానికి సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. ఐతే, ఇది తెలంగాణా కేంద్రంగా ఒరిస్సా, చత్తీస్ గడ్ మొదలు విశాల దక్కనీ సాంస్కృతిక సంపదగా ఉన్న సేకరణ. అందువల్ల తెలంగాణాలోనే ఈ సంపదా సంరక్షణకు ఒక మార్గం వెతుకాలని తిరుమల రావు ఈ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కానీ కేసీఆర్ గారు తిరుమల రావు గారికి అంత సముచిత గౌరవం ఇవ్వడానికి పూనుకుంటారా అన్నది సందేహమే. అదే సమయంలో వారిని ప్రసన్నం చేసుకోవడానికి తిరుమల రావు గారు కూడా పట్టు విడుపులు లేకుండా స్వయంగా ప్రగతి భవన్ కో, ఫార్మ హౌస్ కో వెళ్లి కలిసి మాట్లాడగలరా అన్నదీ సందేహమే.

కాగా, ఎప్పటి కప్పుడు ప్రభుత్వం వైఖరిని వివిధ అంశాల్లో ఖండిస్తూ వచ్చిన తిరుమల రావు గారు తనపై ఉన్న ఈ గురుతరమైన బాధ్యత కోసం తలొగ్గి అద్యకళకు ఒక శాశ్వత వేదికను నిర్మించుకోగలుగుతరా అన్నది విలువైన ప్రశ్న.

అలా గనుక చేస్తే ఇంతకాలం వారు నడిచిన త్రోవకే కాదు, నాగరీకుల నయవంచనలో ఆదివాసీల అసలు అస్తిత్వానికే ఇదివరకు తగిలిన దెబ్బలకు తోడు ఇదొక శరాఘాతమే అవుతుంది.

ప్రైవేట్ వ్యక్తిలకు పూర్తిగా ఇచ్చేయడం మరొక అంశం. ఇలాంటి ప్రతిపాదనలు తనకు అందినప్పటికీ వారు దూరం పెడుతూ వస్తున్నట్టు తెలిసింది. అలా గనుక చేస్తే ఇంతకాలం వారు నడిచిన త్రోవకే కాదు, నాగరీకుల నయవంచనలో ఆదివాసీల అసలు అస్తిత్వానికే ఇదివరకు తగిలిన దెబ్బలకు తోడు ఇదొక శరాఘాతమే అవుతుంది. ద్వితీయంగా అది తన నిబద్దతకు పెను సవాల్ అవుతుంది.

ఇవన్నీ నేటి సందర్భంలో గమనంలో ఉన్న ముఖ్యాంశాలు. నిజానికి ఇవన్నీ అందరూ ఆలోచించారో లేదోగానీ అత్యంత ముఖ్యమైన విధాన పరమైన  విషయం రూపం పొందనున్న సందర్భం ఈ వరం పది రోజులూ అని తెలపడం ఈ సంపాదకీయం ఉద్దేశ్యం.

సాధారణంగా ఏక వ్యక్తి సేన (One man army) లతో ఉన్న సమస్యే ఇది. వారు చివరి వరకూ అలాగే నిలబడితేనే తమ జీవితకాలం కృషి పదుగురికీ ఆదర్శమవుతుంది. కానీ వెనుక ఎవరూ ఉండరు అన్నది విషాదకరమైన వాస్తవం. అది గ్రహించే తిరుమల రావుగారు తన సేకరణ అంతా తన తలపై ఉన్న ఈ భారంగా భావిస్తున్నారు. బహుశా దాన్ని త్వరగా దించుకోవాలని చూస్తున్నారు. నిజానికి ఇలా కాకుండా, ఇవన్నీ ఆలోచించకుండా, ప్రభుత్వం వైపు ఆశగా చూడటం పూర్తిగా మానేసి వారు మరొక సారి దృఢ సంకల్పం చేసుకోవలసే ఉన్నది. ఇదంతా అశేష ప్రజా రాశుల తరతరాల సంపద కనుక, ప్రధాన స్రవంతికి ప్రత్యామ్యాయంగా ఇంతకాలం పనిచేసిన subaltern work ని తిరుమల రావు గారు ఒక ప్రత్యామ్యాయ సాంస్కృతిక ఆయుధంగా నిలపవలసే ఉన్నది. ఆ దిశగా వారు పునరంకితం కావడానికి కవులు, కళాకారులు, మేధావులు పెద్ద ఎత్తున తమ భరోసా ఇస్తూ వారికి నమ్మకం కలిగించాల్సి ఉన్నది.

కొన్ని ఎకరాల స్థలం, కొన్ని కోట్ల రూపాయల మూలధనం, ఒక నిబద్దత గల బృందం. దానికి తిరుమల్ రావు గారి నాయకత్వం ఒక అద్భుతమైన ప్రపంచానికి అది నిస్సంశయంగా దారి చూపుతుంది. అ త్రోవ సిద్దం చేయవలసి ఉన్నది పౌర సమాజమే.

కొన్ని ఎకరాల స్థలం, కొన్ని కోట్ల రూపాయల మూలధనం, ఒక నిబద్దత గల బృందం. దానికి తిరుమల్ రావు గారి నాయకత్వం ఒక అద్భుతమైన ప్రపంచానికి అది నిస్సంశయంగా దారి చూపుతుంది. అ త్రోవ సిద్దం చేయవలసి ఉన్నది పౌర సమాజమే. ఒక స్వతంత్ర విశ్వవిద్యాలయానికి పూనుకుంటే వారు మరింత యువకులు కావడం ఖాయం. అదే అన్ని విధాలా అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది. అందుకు వ్యక్తులు కొందరు ముందుకు రావాలి. తిరుమల రావు గారు ఆ బలంతో ముందుకు నడవాలి. తెలుగు ప్రజల సహకారాన్ని కోరాలి. ఎవరు ఏ మేరకు ముందుకు వచ్చినా ఆహ్వానించడం సముచితం. ఒక నిర్దిష్ట ప్రతిపాదన తయారు చేసి, దశల వారీగా అధ్యకళను సంరక్షణకు నడుం బిగించడం నేటి అత్యయిక పరిస్థితి.

మరి మూడు రోజుల్లో ప్రదర్శన ముగుస్తుంది. ఆ తర్వాత వారం దాకా కూడా చూడవలసిన వారు చూసేందుకు వారు ఉంచడం మంచిది. ఈ లోగా బహిరంగ ప్రకటన ఒకటి సిద్దం చేయడం, ఆద్యకళా సంరక్షణకు తెలుగు ప్రజానీకానికే కాదు, దేశానికే పిలుపు నివ్వడం మంచిది. ఆ పిలుపుకు స్పందించి ప్రభుత్వం కూడా ఒక భాగంగా కదిలి వస్తే మరీ మంచిది.

ఇదంతా తెలుపడం ఎందుకూ అంటే అత్యంత బలహీనమైన ప్రభుత్వాల ముందర బలమైన యోధులు చిన్నబోకూడదని. అంతేకాదు, అన్నిటికన్నా ముఖ్యం ఈ సంపద తిరుమల రావు గారు సేకరించినప్పటికీ అది వారి సొంత అస్తి కాకూడదని. దాన్ని ప్రభుత్వాల ఆస్తిగా మార్చడానికి వారు సహకరించకూడదని కూడా.

 

ఇదంతా తెలుపడం ఎందుకూ అంటే అత్యంత బలహీనమైన ప్రభుత్వాల ముందర బలమైన యోధులు చిన్నబోకూడదని. అంతేకాదు, అన్నిటికన్నా ముఖ్యం ఈ సంపద తిరుమల రావు గారు సేకరించినప్పటికీ అది వారి సొంత అస్తి కాకూడదని. దాన్ని ప్రభుత్వాల ఆస్తిగా మార్చడానికి వారు సహకరించకూడదని కూడా. ఈ మొత్తం ప్రహసనంలో మనం మౌనంగా ఉంటే రెండు విధాలా ఈ సంపదకు నష్టం అని గమనించాలి. నిజానికి మ్యూజియం అన్నది మరణశయ్యే అవుతుందని కూడా గుర్తించాలి. అందుకే అద్యకళా విశ్వవిద్యాలయానికి ఆలోచనల చేయాలి.కార్యాచరణకు నడుం బిగించాలి.

ఒక స్వతంత్ర విశ్వ విద్యాలయాన్ని కలగనాలి. అది విద్యార్థులకే కాదు, వివిధ రంగాల నిపుణులకు అవగాహనా, అధ్యయనం, బోధనా, పరిశోధనకు ఇది కేంద్రం కావాలి. ఇవన్నీ కూడా ఇంత విలువైన సంపదను సంరక్షణ చేసి, బీష్ముడిగా నిలిచిన తిరుమల రావుగారి వల్లే అవుతాయి.

అత్యంత ప్రభలశీలమైన ఈ సంపద జానపదులది. ఆదివాసీలది. గ్రామ దేవతల వంటి ప్రకృతి బిడ్డలది. వారిని వీడి చేసే ఏ పని కూడా వేప చెట్టు మొదలు లేని గ్రామదేవతగా మారుతుందని గుర్తించాలి. కాబట్టి ప్రజలు. కళలు – రెంటి సమన్వయంతో జవజీవాలతో కూడిన ఒక స్వతంత్ర విశ్వ విద్యాలయాన్ని కలగనాలి.  విద్యార్థులకే కాదు, వివిధ రంగాల నిపుణులకు అవగాహనా, అధ్యయనం, బోధనా, పరిశోధనకు ఇది కేంద్రం కావాలి. ఇవన్నీ కూడా ఇంత విలువైన సంపదను సంరక్షణ చేసి, బీష్ముడిగా నిలిచిన తిరుమల రావుగారి వల్లే అవుతాయి.

ముందు పేర్కొన్నట్టు నేడు తిరుమల రావు గారు చౌరస్తాలో నాలుగు కూడళ్ళ మధ్య నిలబడ్డారు. వారికి తెలియని త్రోవలు లేవు. ఇప్పుడు తొవ్వ తీయవలసింది మనం. గొప్ప స్వప్నం ఉన్న ఉన్న తిరుమల రావు గారు ఈ సమయంలో ఎంతమాత్రం డీలా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఆ దిశగా పునరంకితం కావాలని తిరుమల రావు గారికి, ఇప్పటిదాకా సందర్శించిన ప్రతి ఒక్కరికీ తెలుపు పిలుపునిస్తున్నది. ఇక ఈ వారం సరికొత్త చూపుతో ఆలోచనతో సహకారంతో ఆద్యకళను సందర్శిస్తారని వినమ్రంగా కోరుదాం.

కృతజ్ఞతలు.

నేడు తిరుమల రావు గారు చౌరస్తాలో నాలుగు కూడళ్ళ మధ్య నిలబడ్డారు. వారికి తెలియని త్రోవలు లేవు. ఇప్పుడు తొవ్వ తీయవలసింది మనం. గొప్ప స్వప్నం ఉన్న ఉన్న తిరుమల రావు గారు ఈ సమయంలో ఎంతమాత్రం డీలా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది.

More articles

2 COMMENTS

  1. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళల పట్ల మన తెలంగాణ ప్రభుత్వం మొదట్లో చూపిన శ్రద్ధ క్రమంగా తగ్గుతుంది. అధికార భాషా సంఘం, తెలంగాణ సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు. వాటికి కనీసం కమిటీలు కూడా లేవు. సంవత్సరం పొడుగునా ఆయా సంస్థల కార్యాచరణ ఏమిటన్నది కూడా తెలువదు. అంతేకాక తెలంగాణ సాహిత్యసాంస్కృతిక రంగంలోకి ఆంధ్ర పెత్తనం జొరబడుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం తన విధానాల ప్రాముఖ్యతను మార్చుకున్నదా అనే ఈ సందేహ సమయంలో కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు వారి అజెండాలను పక్కకు పెట్టి అంతా ఒకటిగా ప్రభుత్వాన్ని హెచ్చరించడమో, సంప్రదించడమో చేయాలి. తిరుమల రావు గారి కృషి వెలకట్టలేనిది. మీ సంపాదకీయంలో అభిప్రాయపడినట్లు స్వతంత్ర ఆద్యకళా విశ్వవిద్యాలయం చర్చకు ఈ పరిస్థితులు దారి తీసి తిరుమల రావు గారి కృషి సజీవంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను.

  2. సాలార్ జంగ్ మ్యూజియంలో / లేదా జెఎన్ టియు ఫైన్ ఆర్ట్స్ లో ‘జయధీర్ ఆద్యకళ’ కలెక్షన్స్ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు కృషి చేయడం గురించి ఆలోచించాలి.

    పి.వి. తనయ, శ్రీవేంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ నిర్వాహకులు వాణిదేవి గారు, వ్యక్తిగతంగా ప్రభుత్వపరంగా సమర్థురాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article